Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్‌

నగరంలోని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్‌సీ కేసులో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరించి.. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. షర్మిలను అరెస్ట్‌ చేసి లోటస్‌ పాండ్‌ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. షర్మిలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తనకు లుకౌట్‌ నోటీసులు ఇచ్చారని.. లుకౌట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినలా అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్‌ కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img