Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు

రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ట్రిపుల్‌ ఐటీ, బాసర) లో పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు బాసర ట్రిపుల్‌ ఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడిరచింది. అయితే కోవిడ్‌ కారణంగా గత విద్యా సంవత్సరం పది పరీక్షలు నిర్వహించనందున, పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు కల్పించారు. కానీ ఈ విద్యా సంవత్సరం మాత్రం టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయని యూనివర్సిటీ పరిపాలనాధికారి డాక్టర్‌ వై రాజేశ్వర్‌ రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img