హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పారామౌంట్ కాలనీలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ ఆ ప్రాంతంలో ముందుజాగ్రత్తగా కరోనా ఆంక్షలు విధించాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ ఏరియాలో ఉంటున్నారు. సోమాలియాకు చెందిన 23 ఏండ్ల యువకుడు టోలిచౌకీలోని పారామౌంట్ హిల్స్ కాలనీలో అద్దె గదిలో ఉంటున్నాడు. వీరి కుటుంబ సభ్యులతో పాటు పారామౌంట్ హిల్స్, ఐఏఎస్ కాలనీలో 150 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.ముందు జాగ్రత్తగా పారామౌంట్ కాలనీలో కరోనా ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కేసు నమోదుతో 25 ఇండ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు.