ట్యాంక్ బ్యాండ్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యింది. దాదాపు 6500లకు పైగా బడా గణేష్ విగ్రహాలు హస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిమజ్జనం పూర్తి అయిన సందర్భంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మార్గ్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు.మరోవైపు నిమజ్జన ప్రాంతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటేషన్ పనులను ప్రారంభించింది.