Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ట్రాఫిక్‌ చలాన్‌..ఒక్కరోజే రూ.5.5 కోట్ల ఆదాయం

రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న చలాన్ల చెల్లింపు కోసం పోలీసు శాఖ ప్రత్యేక రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుండి 31 వరకు ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపుపై రాయితీ ప్రకటించగా తొలిరోజు మంచిస్పందన వచ్చింది. నిమిషానికి 700 మంది పెండిరగ్‌ చలాన్లు చెల్లించగా ఓ దశలో ట్రాఫిక్‌ చలాన్‌ చెల్లించేందుకు ఎక్కువమంది రావడంతో సైట్‌ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది.ఇక తొలిరోజు 5 లక్షల ట్రాఫిక్‌ ఛలాన్‌లు క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలిరోజు రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్‌ ఛలాన్‌లు చెల్లిస్తారని పోలీసులు భావించారు కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 5 లక్షలకు పైగా పెండిరగ్‌ ఛలాన్‌లు క్లియర్‌ అయిపోయాయి. దీంతో పోలీస్‌ శాఖకు ఏకంగా రూ.5.5 కోట్ల మేర ఆదాయం లభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img