ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ్ కొత్త సీఈవోగా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థల్లో కామన్ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంతర్జాతీయ కంపెనీలన్నింటికి ఇండియాలో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.