Friday, April 19, 2024
Friday, April 19, 2024

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఎలాంటి పైరవీలు ఉండవు : మంత్రి కేటీఆర్‌

నగరంలోని పేదలందరికీ ఇళ్లు వచ్చేలా చూస్తామని, ఈ విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. , లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభించామని వెల్లడిరచారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు.మార్కెట్‌లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్‌ 10 రెట్లు పెంచామని చెప్పారు.తెలంగాణ వచ్చాక విద్యుత్‌, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img