Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

డ్రగ్స్‌ నిర్మూలన కోసం నార్కోటిక్‌ వింగ్‌ ఏర్పాటు

: సీపీ సీవి ఆనంద్‌
డ్రగ్స్‌ నిర్మూలన కోసం నార్కోటిక్‌ వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ సీవి ఆనంద్‌ వెల్లడిరచారు. తెలంగాణలో డ్రగ్స్‌ పూర్తిగా నిర్మూలన చేయాలని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో, మన తెలంగాణలో ఏటూరు నాగారం ఏరియాలో సీక్రెట్‌గా గంజాయి సాగు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కువగా డ్రగ్స్‌ వాడుతున్నారని చెప్పారు. నగరంలో ఉన్న సంపన్నులు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ తెప్పించుకొని వారికి తెలిసిన వాళ్ళకు అలవాటు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ కొన్ని ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో పిల్లలు కూడా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు సమాచారం ఉందని చెప్పారు. డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌ ప్రోగ్రాంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు. డ్రగ్స్‌ వాడుతున్నా, విక్రయం జరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img