డ్రగ్స్ కేసులు పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నగరంలోని నాలుగు ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డగ్స్కు బానిసైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్కు తరలిస్తామన్నారు. . జనవరి నుంచి 377 మంది డ్రగ్స్ సేవించే వారిని, రవాణా చేసే వారిని అరెస్టు చేశామన్నారు. అందులో 93 మంది డ్రగ్స్ పెడలర్లున్నారన్నారు. డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టామన్నారు. వారు బయటకి వచ్చిన తరువాత మంచి పౌరులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన అన్నారు. డ్రగ్స్ వాడేవారికి రక్త, యూరిన్ పరీక్షలు చేస్తామన్నారు. వారానికి ఒకసారి వారి అనుమతితోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు 300 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులకు పరీక్షలు చేశామని వెల్లడిరచారు. డ్రగ్స్ వినియోగదారులను కట్టడి చేసేందుకే కొత్త కౌన్సెలింగ్ విధానం తీసుకొచ్చామని తెలిపారు.