Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

తలసానికి కొరమీను చేపలను అందించిన మత్స్యకారులు

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్‌ కు చెందిన మత్స్యకారులు తలసానికి కొరమీను చేపలను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలతో మత్స్యకారుల ఆదాయం ఎంతో పెరిగిందని తెలిపారు. అందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. తమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మత్స్యశాఖ మంత్రికి కొరమీను చేపలను అందిస్తున్నట్టు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో శాడా కోటేశ్వరరావు, గడప దేవేందర్‌, గరిగే నరసింగరావు, గరిగే సంపత్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img