నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
అసలే ఎండాకాలం.. ఉదయం 7 గంటల తర్వాత నుంచి ఎండ ప్రభావం మొదలవుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా అప్పుడే మొదలైంది. దీంతో మధ్యాహ్నం వేళల్లో ఎక్కువమంది బయటకు రావడం లేదు. ఎండలు పెరుగుతుండటంతో.. అత్యవసమైతే తప్ప ప్రజలు బయటకు రావడం కాస్త తగ్గుతోంది.ఎండలు కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తన బులిటెన్లో పేర్కొంది. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.