Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

తెలంగాణపై మొసలి కన్నీళ్లు ఆపండి..

రాహుల్‌ గాంధీపై మంత్రి హరీశ్‌ రావు ధ్వజం
ధాన్యం సేకరణ విషయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మరిస్తుందని రాహుల్‌ చేసిన ట్వీట్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని రాహుల్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఆందోళన చేయాలని డిమాండ్‌ చేశారు.రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయాలని సూచించారు. ఒకే దేశం ఒకే సేకరణపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోవద్దు అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img