Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. ఐపీఎస్‌, ఐఏఎస్‌, అదనపు కలెక్టర్‌ హోదా, నాన్‌ కేడరర్‌ అధికారులను బదిలీ చేయడం, అలాగే వేయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లను ఇస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా బీఎస్‌ లత, .నారాయణ్‌పేట అదనపు కలెక్టర్‌గా పద్మజారాణి, .రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా బీమానాయక్‌, .వరంగల్‌ అదనపు కలెక్టర్‌గా కె . శ్రీవాస్తవ .ములుగు అదనపు కలెక్టర్‌గా గా వై వి గణేష్‌, .మహబూబ్‌ నగర్‌ అదనపు కలెక్టర్‌గా ఎం డేవిడ్‌, .నాగర్‌ కర్నూల్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న పీ శ్రీనివాసరెడ్డి సిద్ధిపేటకు బదీలీ చేశారు. .అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పాలనాధికారి చంద్రమోహన్‌ను కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా బదీలీ చేశారు. .చంచల్‌ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్‌కుమార్‌తో పాటు హైదరాబాద్‌ జిల్లా భూపరిరక్షణ ఎన్డీసీగా బీ. సంతోషిని నియమించింది ప్రభుత్వం. వీరేతో పాటు పలువురు నాన్‌ కేడర్‌ అధికారులను కూడా బదిలీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img