తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిరదని పేర్కొన్నది. దీని ప్రభావంతో పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.