నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్శాఖ తెలిపింది.నిన్న ఒక్క రోజే రూ.172 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. గత ఐదు వ్యవధిలోనేనే రూ.902 కోట్ల మద్యాన్ని మందుబాబులు స్వాహా చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021 శుక్రవారం సాయంత్రానికే 30,196 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 6,970 కోట్లు, నల్గొండ జిల్లాలో 3288 కోట్లు, హైదరాబాద్లో 3,201 కోట్ల అమ్మకాలు నమోదయినట్లు ఎక్సైజ్శాఖ వెల్లడిరచింది.