తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా 40కి చేరుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ (%Iవీణ%) హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది.