రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతోనే వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది.