తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 2న విడుదల చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. 10వ తరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ http://www.results.manabadi.co.in/2022/TS/SSC-Sup/Telangana-TS-10th-class-SSC-Supply-Results-02092022.htm
ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 10 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఫలితాల కోసం వెబ్సైట్: https://www.bse.telangana.gov.in