Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాహుల్‌ గాంధీని నమ్మే పరిస్థితిలో లేరు : బాల్క సుమన్‌

స్వరాష్ట్రం యూపీలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించలేని రాహుల్‌ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాహుల్‌ గాంధీని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. జగ్గారెడ్డి ఉద్యమ పార్టీకి ద్రోహం చేశారని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ కమెడియన్‌గా మారాడని, బండి యాప్‌ పాదయాత్ర ఫెయిల్యూర్‌గా నడుస్తున్నదన్నారు. బీజేపీ,ి కాంగ్రెస్‌ లు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో నడవదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img