అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఢఫిెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు తరలించారని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్జ్లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.. ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పారు. దేశ రక్షణ రంగంలో హైదరాబాద్లోని రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర అని చెప్పారు.