Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కొత్త జడ్జీలు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, భీమపాక నగేశ్‌, పుల్లా కార్తీక్‌, కాజా శరత్‌ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు నియామకమైన విషయం తెలిసిందే. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img