: దక్షిణమధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో రూ.10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ తెలిపారు. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు, తెలుగురాష్ట్రాలకు కేటాయింపు వివరాలను తెలిపారు. తెలంగాణకు రూ.3,048 కోట్లు, ఏపీకి రూ.7,032 కోట్లు కేటాయింపులు జరిపినట్లు వెల్లడిరచారు. కొత్త లైన్లు, డబుల్ లైన్లు, మూడో లైన్, ఎలక్ట్రీషియన్కు రూ.9,125కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో కొత్త లైన్ల కోసమే రూ.2,187 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ కేటాయించినట్లు తెలిపారు.