Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

త్వరలోనే ఆదివాసీ భవన్‌ ప్రారంభం.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణలోని ఆదివాసీల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గూడెంలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది ఆదివాసీల కళను సీఎం కేసీఆర్‌ తీర్చారని పేర్కొన్నారు. జోడేఘాట్‌లో కుమ్రం భీం మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లాకు కుమ్రం భీం జిల్లా అని నామకరణం చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img