మంత్రి సత్యవతి రాథోడ్
త్వరలో అనాథల సంరక్షణ కోసం అద్భుతమైన పాలసీ రానుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మంత్రి సత్యవతి అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేపథ్యంలో ఆమెతోపాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, బాల నేరస్తుల శాఖ సంచాలకులు శైలజా ఇవాళ రాష్ట్రంలోని కొన్ని అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశమయ్యారు. అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితి గతులు మెరుగుపరచి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.