రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్లోని బీడీ ఎన్టీ ల్యాబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.