సింగరేణి మండలం చీమలవారిగూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, వంతెన కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, 4 కి. మీ. బీటీ రోడ్డుతో పాటు 12 సీడీ పనులను రూ. 5 కోట్లతో సంబధిత అధికారులు అంచనా వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.. తెలంగాణ శాసనసభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.