పాలకీడు మండలం రావిపహాడ్ పరిధిలో గల దక్కన్ సిమెంట్ సున్నపురాయి గని-3 మైనింగ్ నిలిపివేతకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.సైదులు నామా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 26,27లోని 183.11(457.77ఎకరాలు) హెక్టార్లలో జరుగుతున్న చట్టవ్యతిరేక మైనింగ్ నిలుపుదలకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన దిసభ్య ధర్మాసనం ఆదేశించింది.గని2, గని
3లో జరిగిన చట్టవ్యతిరేక మైనింగ్ నకు అపరాధ రుసుము విధించాల్సిందిగా గతంలోనే మైనింగ్ శాఖను ఆదేశిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది.. రూ.600 కోట్లు అపరాధ రుసుము విధించవచ్చని ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. సామాన్యుడి ఫిర్యాదుతో డెక్కన్ సిమెంట్ మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.