Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘దళితబంధు’కు మరో రూ. 200 కోట్లు విడుదల

దళితబంధు పథకానికి తెలంగాణ సర్కార్‌ ఇవాళ మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకానికి ప్రభుత్వం తొలి విడత రూ. 500 కోట్లు, సోమవారం రెండో విడతలో మరో రూ. 500 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇవాళ మరో 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img