దళితబంధు పథకంపై కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దళితబంధుపై సీఎం కేసీఆర్ కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరయ్యారు.