: మంత్రి హరీశ్రావు
దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో దళిత బంధు ప్రాజెక్టులో భాగంగా 100 యూనిట్లను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల కోసం నేరుగా పది లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. 300 వైన్ షాపు లు దళితులకు కేటాయించాం. నూతన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీ సుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ టెండర్లలో ఎస్సీల అవకాశం ఇస్తున్నామని, దళితుల సంక్షేమంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. ఎస్సీ లతో ప్రారంభమైన కల్యాణ లక్ష్మి తర్వత అన్ని వర్గాల వారికి ఇస్తున్నామని తెలిపారు. దళిత బంధు ఒక పథకం కాదు, ఒక ఉద్యమం అని పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదని మండిపడ్డారు. అన్ని వర్గాల శ్రమను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటున్నదని విమర్శించారు.