దళిత బంధు పథకం అమలులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, అందరికీ, ప్రతి కుటుంబానికి వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.శాలపల్లి వేదికగా దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 17 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేస్తే ఒక లక్షా 70 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. సంవత్సరానికి 30 వేల 40 వేల కోట్లు ఖర్చు పెడితే మూడేండ్లలో దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయన్నారు. మూడు నాలుగేండ్లలో దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయన్న గోరటి వెంకన్న కల నెరవేరాలని అన్నారు.