: మంత్రి కొప్పుల ఈశ్వర్
దళిత బందు పథకం అమలులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..ఈనెల 16న హుజురాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ లాల్, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.