దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ తెలిపారు. దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని, ఆరునూరైనా దళితబంధు ఆగదు..ఆపలేరు..వంద శాతం అమలుచేసి తీరుతామని స్పష్టంచేశారు. ఆర్థిక పరిమితుల మేరకు దశల వారీగా అమలుచేస్తామన్నారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందని చెప్పారు. దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చుచేస్తామని వివరించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.