Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దావోస్‌కు మంత్రి కేటీఆర్‌..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్‌ కేంద్రంగా జరిగే వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సమ్మిట్‌ లో పాల్గొననున్నారు. ఈ సదస్సు మే 22-26 వరకు జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మ్కె, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోపాటు మరికొన్ని రాష్ట్రాల నేతలు హాజరై తమ ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికల గురించి వివరిస్తారని సమాచారం. భారత్‌ నుంచి కనీసం 100 మంది సీఈవోలు, ప్రపంచవ్యాప్తంగా 300 మందికి పైగా ప్రముఖులు ఈ సదస్సు కోసం ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img