Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దిల్లీకి పయనమైన మంత్రులు..

దిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు దిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం దిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుండి బయల్దేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మంగళవారం దిల్లీకి బయలుదేరిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img