Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిల్లీకి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నేడు (శుక్రవారం) దిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న దిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. సీజేఐ జస్టీస్‌ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్‌ జ్యూడిషీయల్‌ ఇన్ఫ్రాస్టక్టర్‌ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img