దిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ ట్వీట్ చేశారు.ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్ల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్డుపైకి రావాల్సి వస్తుందని టికాయత్ హెచ్చరించారు.