దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దిల్లీలోని వసంత్ కుంజ్లో టీఆర్ఎస్కు కేటాయించిన స్థలంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. ఆయనతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు ఈ కా్యక్రమానికి హాజరయ్యారు. కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది.