దిల్ల్లీ మద్యం విధానంలో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేయడంతో పాటు నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతుండగా.. తర్వాత కోర్టును వెళ్లనున్నారు.