Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలి

అనిల్‌ కూర్మాచలం
తెలంగాణ వ్యాప్తంగా రేపు (నవంబర్‌ 12 వ తేదీన) నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎన్నారైల పక్షాన ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం కోరారు. బీజేపీ పార్టీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్న ధర్నా కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని మరొక్కసారి తెలంగాణ సత్తా ఢల్లీికి తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నారైలంతా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఎన్నారైలంతా ఉన్నారని, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉండి బంగారు తెలంగాణ నిర్మాణంలో బాగస్వాములవుతారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img