ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈరోజు ఉదయం ప్రజాప్రతినిధులతో, పార్టీ ముఖ్యనాయకులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండిరచిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. నేటి నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాలో మొత్తం 412 కొనుగోలు కేంద్రాలున్నాయని, అందులో 225 ఐకేపీ, 10 మార్కెట్ కమిటీ, 187 కో ఆపరేట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ధాన్యం ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లోకి రాబోతుందన్నారు. కాబట్టి ఎంపిపిలు, జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కో అపరేట్ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు.