Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్ ను పరిశీలించిన సీపీ రంగనాథ్

కమాలపూర్ మండలంలోని గూడూరు గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు పీపీసీ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో పోలీస్ కమిషనర్ ముచ్చటించారు. ధాన్యం కొనుగోలు సమయంలో తీస్తున్న తరుగు వివరాలను పోలీస్ కమిషనర్ రైతులను అడిగి తెలుసుకోగా.. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా అధిక మొత్తంలో తరుగు పేరుతో రైస్ మిల్లర్ దోపిడీకి పాల్పడుతున్నట్లుగా రైతులు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో ముచ్చర్ల నాగారం క్రాస్ రోడ్ వద్ద ఉన్న సప్తగిరి రైస్ మిల్లును పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ , స్ధానిక పోలీస్ అధికారులతో కల్సి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో ధాన్యం తూకం సమయంలో రైస్ మిల్ యాజమాన్యం రసీదులపై నమోదు చేసిన తూకం వివరాలు, తరుగు వివరాలను పరిశీలించి రైస్ మిల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రైస్ మిల్లు పై చట్టపరమైన చర్యలు తీసుకోవలసింది పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img