మోడీ నూతన వ్యవసాయ చట్టాల రద్దులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఎవరి మెడలు ఎవరు వంచారో తెలుసుకోవాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, యాసంగి పంట కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. గత రబీ సీజన్ ధాన్యం ఇంకా 50 శాతం గోదాముల్లోనే ఉందని, అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు ఉంటున్నాయని తెలిపారు.ధాన్యం తరలించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడుతోందన్నారు. కేంద్రం రైల్వే వాగన్లు ఇచ్చి ధాన్యం నిల్వలను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు.