తెలంగాణ నేతలకు అమిత్షా దిశానిర్దేశం
తెలంగాణ సీఎం కేసీఆర్పై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్షా సూచించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి, తదితరులు అమిత్షాతో మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలకు అమిత్షా దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీపై టీఆర్ఎస్ చేసే ఆరోపణలు తిప్పికొట్టాలని అన్నారు. నేతలు, ప్రజల మధ్య ఉండే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ధాన్యం విషయంలో టీఆర్ఎస్ వైఖరిని బహిర్గతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. . కేసీఆర్కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్షా హామీ ఇచ్చారు.