ధాన్యం సేకరణపై దిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. తెలంగాణలో రైతులు పండిరచిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ సర్కార్ దిల్లీలోని తెలంగాణ భవన్లో దీక్ష చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ ఆయన వెంట ఉన్నారు. వేదికపై సీఎం కేసీఆర్, టికాయత్లతోపాటు పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్సభాపక్షనేత నామా, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు కూర్చున్నారు. దీక్షలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరిధాన్యం కొనగోళ్లపై టీఆర్ఎస్ కేంద్రానికి అల్టిమేటం ఇవ్వనున్నట్లు సమాచారం. దీక్ష వేదికగా టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.