వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మంగళవారం ఉదయం మంగళవారం నిరుద్యోగ దీక్ష మొదలుపెట్టారు. ఈ గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్ష ప్రారంభించారు.సాయంత్రం 5 గంటల వరకూ షర్మిల దీక్ష కొనసాగుతుంది. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ షర్మిల ప్రతీ మంగళవారం నిరుద్యోగల కోసం చేస్తున్న నిరాహార దీక్ష నేటికి మూడో వారం చేరుకుంది.