Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మంగళవారం ఉదయం మంగళవారం నిరుద్యోగ దీక్ష మొదలుపెట్టారు. ఈ గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్ష ప్రారంభించారు.సాయంత్రం 5 గంటల వరకూ షర్మిల దీక్ష కొనసాగుతుంది. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ షర్మిల ప్రతీ మంగళవారం నిరుద్యోగల కోసం చేస్తున్న నిరాహార దీక్ష నేటికి మూడో వారం చేరుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img