Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నాలాల అభివృద్ధితోనే ముంపు బాధల నుంచి విముక్తి : మంత్రి తలసాని

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ వద్ద 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు.ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. నాలాల అభివృద్ధితోనే ముంపు బాధల నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాధ్‌, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, సనత్‌ నగర్‌ కార్పొరేటర్‌ కొలన్‌ లక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img