Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ
నాలుగు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని కోరారు. ప్రతి సంవత్సరం 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు సరఫరా చేయడం ఎంతో ముఖ్యమన్నారు.కాగా, సింగరేణి బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులు మంజూరు చేసిందని, అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాలని కేసీఆర్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img