Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నా మాటలు వక్రీకరించారు: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అమ్ముడుపోయారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామెంట్‌ చేశారనే వార్తలు దుమారాన్ని రేపాయి. దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ… ఈ వ్యాఖ్యలు తాను చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు.కాంగ్రెస్‌ లో సీనియర్లు అమ్ముడుపోయారంటూ ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని విమర్శించారు. తాను అనని మాటలను అన్నట్టుగా రాశారని దుయ్యబట్టారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. వార్తలు రాసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని అన్నారు. రాజకీయ వివాదాలను సృష్టించి సమస్యను జటిలం చేసే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img