కామన్వెల్త్ గేమ్స్- 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను.. ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తన నివాసానికి వచ్చిన నిఖత్ కుటుంబసభ్యులను సన్మానించారు. ఎమ్మెల్సీ కవిత తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి.. ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని నిఖత్ వివరించారు. సీఎం కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని నిఖత్ గుర్తుచేసుకున్నారు. అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేసి.. నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు నిఖత్ జరీన్ కృతజ్ఞతలు చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. నిఖత్ జరీన్ తోపాటు స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను కలిశారు.